హాలీవుడ్​ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్​.,,?

ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ లతో హీరో ప్రభాస్ కాస్త బిజీ గానే ఉన్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరో ప్రభాస్ సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతి త్వరలో హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నడని.

ఇందులో భాగంగానే హాలీవుడ్ లో ఎంతగానో ప్రాముఖ్యం చెందిన సిరీస్ లలో ఒకటైన మిషన్ ఇంపాజిబుల్ లో హీరో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ సిరీస్లో భాగంగా ఏడవ పార్ట్ లో ఆయన కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు కాలంలో రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇటలీ దేశంలో చిత్రీకరణ సమయంలో మిషన్ ఇంపాజిబుల్ దర్శకుడు క్రిస్టఫర్ ప్రభాస్ ను కలిసి కథ చెప్పాడట. దాంతో హీరో ప్రభాస్ అక్కడ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు క్రిస్టఫర్ స్పందిస్తూ.. తాను హీరో ప్రభాస్ ఎప్పుడు కలవలేదని తెలియజేశాడు. దీంతో ఆ వార్తలన్నీ అవాస్తవమని నిర్ధారణ జరిగింది.