`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఏ సినిమానూ థియేట‌ర్‌లో విడుద‌ల అయ్యే ప‌రిస్థితి లేదు.

ఇదిలా ఉంటే.. ఖిలాడి సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. అయితే మరి థియేటర్ రిలీజ్ తరువాత ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? లేదంటే నేరుగా ఓటీటీలోనే వస్తుందా? అనే విషయంలో క్లారిటీ లేదు.