త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేష్ భారీ రెమ్యున‌రేష‌న్?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వాటి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇది పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు మ‌హేష్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే..ఈ చిత్రానికి మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ భారీగానే తీసుకుంటున్నార‌ట‌. రూ. 60 నుంచి రూ. 70 కోట్ల వ‌ర‌కు మ‌హేష్ పుచ్చుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.