సెకెండ్ వేవ్లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత, హాస్పటల్స్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉండటంతో.. ప్రజలు మరింత ఇబ్బంది పడిపోతున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాను దత్తతు తీసుకున్న బుర్రిపాలెం గ్రామ ప్రజలకు మరోసారి అండగా నిలిచారు.
అక్కడివారికి వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మహేష్ బాబు అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.