ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్స్టోరీని పూర్తి చేసిన నాగ చైతన్య.. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు చైతూ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఆమిర్ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్తో కలిసి ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్లో కూడా పాల్గొన్నాడు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతూను ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల లైన్లో పెట్టాడట. ఇటీవలె వెంకీ ఓ కథతో చైతూ వద్దకు వెళ్లి వినిపించాడట. అది బాగా నచ్చడంతో.. చైతూ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతేకాదు, త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్.