దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న రిలీజ్ కాబోతుంది. అలాగే అందాల భామ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ చిత్రం మే 20న డిస్నీ+ హాట్స్టార్ లో రిలీజ్ కానుంది.
ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న సినిమా బండి మే 14 న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ డి-కంపెనీ.ఈ మూవీ మే 15న ఓటీటీ ప్లాట్ఫామ్ స్పార్క్లో స్ట్రీమ్ కానుంది. కార్తీక్ రాపోలు దర్శకుడిగా ఏక్ మినీ కథ తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ హక్కులను దక్కించుకోవాలని చూస్తుంది. అలాగే రానా దగ్గుబాటి నటించిన అరణ్య మూవీ మే 14 లేదా మే చివరి వారంలో జీ 5లో ప్రసారం అవుతుందని సమాచారం.