మ‌హేష్ సినిమాలో సాగ‌ర‌క‌న్య పాత్రేంటో తెలుసా?

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ భామ, సాగ‌ర‌క‌న్య‌లా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న‌ శిల్పా శెట్టిని తీసుకున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె పాత్రకు సంబంధించి మ‌రో అప్డేట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌హేష్‌కు పిన్నిగా శిల్పా శెట్టి క‌నిపించ‌నుంద‌ట‌. అంతేకాదు, ఆ పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా మారుతుందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.