ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలోనే నిజ జీవిత సంఘటల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కబోతోంది.
ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించబోతోందట. ఇటీవలె గోపీచంద్ మాలినేని.. ఆమెను సంప్రదించి కథ చెప్పాడట. అయితే ఆమె తాజాగా బాలయ్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా, లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మాలినేని, రవితేజ కాంబోలో తెరకెక్కిన క్రాక్ చిత్రంతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి.. బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రుతికి టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన సలార్లో నటిస్తోంది.