టాలీవుడ్ టాప్ సింగర్స్లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్స్టా లైవ్లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది.
ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్స్టా లైవ్లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వాట్సాప్ నెంబర్ చెప్పమని ప్రశ్నించాడు.
దీంతో వెంటనే సునీత నవ్వుతూ తన స్వీట్ వాయిస్ తో సో సారీ అండి అంటూ నొప్పించకుండా తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇక మరోవైపు తన ఫాలోవర్స్ కరోనా జాగ్రత్తలు కూడా చెప్పింది. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని సునీత సూచించింది.