కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( తమిళంలో సూరారై పోట్రు). ఇటీవలె ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్కు ఈ సినిమా ఎంపికైంది.
ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వరకు జరిగే చిత్రాల ప్రదర్శనలో ఈ చిత్రాన్ని పనోరమ విభాగంలో ఎంపిక చేశారు. భారత్ నుంచి ఈ ఫెస్టివల్కు మూడు సినిమాలు ఎంపిక కాగా.. దక్షిణాది ఇండస్ట్రీల నుంచి ఎంపికైన ఏకైన సినిమాగా సూరరై పోట్రు నిలిచింది.