విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందట. ఆయనకే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారట అనిల్ రావిపూడి.
ప్రస్తుతం ఈ వార్త జోరుగా వైరల్ అవ్వడంతో.. వెంకీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. మల్టీస్టారర్ అన్నాక ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలిగా అంటూ అనిల్పై అసహనం వ్యక్తం చేస్తున్నారట.