ఆగిపోయిన విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌..కార‌ణం అదే!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మేరీ క్రిస్మస్ సినిమా ఒక‌టి.

కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్త‌వానికి ఈ చిత్రం ఏప్రిల్​లోనే సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది.

కానీ, అప్పుడు కత్రినాకు కరోనా రావడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్ ను ప్రారంభిచాలని భావించారు. కానీ, ఇంత‌లోనే క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుప‌డుతోంది. దీంతో మ‌రోసారి ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. ఇక జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. మ‌రి అప్ప‌టికైనా క‌రోనా క‌రుణిస్తుందో.. లేదో.. చూడాలి.