రాముడిగా తారక్ .. సీతగా కియారా..?

తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న చూపుల‌తో ప‌డ‌గొట్టి ఎస్కేప్ అయింది కియారా అద్వానీ. ఆమె టాలీవుడ్‌లో చేసింది రెండు సినిమాలే అయినా మ‌స్తు పాలోయింగ్ తెచ్చుకుంది. ఇక్కడి హీరోలు కూడా కియారా తో చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ముంబై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు తెగ పోటీ ప‌డుతున్నారు.

అయితే సొషల్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఎప్పుడు యూ టర్న్ తీసుకుంటారని ప్రశ్నించాడు ఓ నెటిజ‌న్‌. ఇక దీనికి త్వరలోనే చెప్పింది కియారా. అయిఏ ఆమె ఎన్టీఆర్30వ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ వ‌స్తుండ‌టంతో.. కొరటాల శివ ఆల్రెడీ కియారాతో ప‌నిచేశారు. ఆ స‌న్నిహిత్యంతోనే కియారాను మ‌రోసారి తీసుకోవాల‌ని చూస్తున్నారంట‌. దీనిపై త్వ‌ర‌లోనే అప్‌డేట్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.