తెలుగు ప్రేక్షకులను తన చూపులతో పడగొట్టి ఎస్కేప్ అయింది కియారా అద్వానీ. ఆమె టాలీవుడ్లో చేసింది రెండు సినిమాలే అయినా మస్తు పాలోయింగ్ తెచ్చుకుంది. ఇక్కడి హీరోలు కూడా కియారా తో చేసేందుకు ముందుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ముంబై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు తెగ పోటీ పడుతున్నారు.
అయితే సొషల్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు యూ టర్న్ తీసుకుంటారని ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఇక దీనికి త్వరలోనే చెప్పింది కియారా. అయిఏ ఆమె ఎన్టీఆర్30వ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ వస్తుండటంతో.. కొరటాల శివ ఆల్రెడీ కియారాతో పనిచేశారు. ఆ సన్నిహిత్యంతోనే కియారాను మరోసారి తీసుకోవాలని చూస్తున్నారంట. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.