క‌రోనాతో ప్ర‌ముఖ న‌టి కవిత కుమారుడు మృతి..ఆసుపత్రిలో భ‌ర్త!

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా 1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ప్ర‌స్తుతం సీరియ‌ల్ న‌టిగా దూసుకుపోతున్న క‌విత‌ ఇంట క‌రోనా క‌ల్లోలం రేపింది.

ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్‌ రూప్ క‌రోనాతో మృతి చెందాడు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డ్డ సంజ‌య్ ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

అయితే అతని ఆరోగ్యం ఏ మాత్రం మెరుగపడ‌క‌పోవ‌డంతో.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ సంజ‌య్‌ తుది శ్వాస విడిచారు. దీంతో క‌విత కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా, క‌విత విష‌యానికి వ‌స్తే.. ఈమె హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. సుమారు 350 సినిమాలు చేసింది కవిత.. ఇంట‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.