టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ను ఎప్పుడో ప్రకటించినా.. ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల వకీల్ సాబ్తో హిట్ అందుకుని మంచి జోరు మీద ఉన్న వేణు శ్రీరామ్.. ఆలస్యం చేయకుండా ఐకాన్ ను కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మించనున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో బన్నీ అంధుడి పాత్రలో కనిపించనున్నాడట. ఢిపరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమాకు కనుబడుట లేదు అనేది ట్యాగ్ లైన్. అయితే సినిమాలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవని.. అందుకే ట్యాగ్ లైన్ అలా పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.