24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.

అయితే థర్డ్‌వేవ్‌పై ముందుగానే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తోంది. మున్ముందు పిల్లలకు ఎటువంటి సమస్యలు రాకుండా భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.