నందమూరి బాలకృష్ణ మంచి జోరుమీదున్నారు. ఆయన తన పుట్టినరోజు సందర్బంగా 107వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేనితో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ ఈ మూవీని చేస్తున్నారు బాలయ్య. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. రవితేజ క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్కుమార్ గుర్తుంది కదా. ఆమెనే ఇప్పుడు ఇందులో కూడా కీ రోల్ పోషించబోతుందని టాక్ వస్తోంది.
గోపీచంద్ కథ చెప్పగానే వరలక్ష్మి ఎక్జయిటింగ్ గా ఉందని చెప్పి ఓకే చెప్పిందంట. అసలే బాలకృష్ణ మాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్టులో వరలక్ష్మి తనకు చాన్స రావవడంతో తనకు ఎలాంటి పవర్ ఫుల్ రోల్ ఉంటుందో తెలుసుకోవచ్చు.అయితే ఈమె క్యారెక్టర్కు ప్రస్తుతానికి సస్పెన్స్ ఉంచారు డైరెక్టర్. అఖండ మూవీకి సంబంధించిన పూర్తి పనులు కాగానే గోపీచంద్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తారు బాలకృష్ణ. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.