టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తల్లైంది. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీనే ఓపెన్గా చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో ఉంటున్న ఛార్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన పెంపుడు కుక్క పిల్లలతో అల్లరి చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
అయితే తాజాగా షూటింగ్స్ కోసం ముంబై వెళ్లిన రష్మిక.. ఛార్మీని కలిసింది. ఈ సందర్భంగా రష్మిక.. ఛార్మి కొన్న కుక్క పిల్లలను దత్తత తీసుకుంది. ఈ విషయాన్ని ఛార్మీ.. సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తల్లివి అయినందుకు కంగ్రాట్స్ రష్మిక.. మీ బిడ్డ ఎంతో బాగుంది.. మా ముంబైకి వెల్కమ్ అని పేర్కొంటూ పెట్స్తో దిగిన ఫొటోలను ఛార్మీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
https://www.instagram.com/p/CQFiKH8M_fX/?utm_source=ig_web_copy_link