కొర‌టాల సంచ‌ల‌న నిర్ణ‌యం..షాక్‌లో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైర్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన కొర‌టాల శివ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్ల‌డిస్తూ.. అభిమానుల‌ను, ఫాలోవ‌ర్స్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఈ మేర‌కు ట్విట‌ర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశారు.

`హ‌లో..నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా, స‌న్నిహితుల ద్వారా ప్రతి అప్‌డేట్‌ అందిస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంటాను.

మీతో మాట్లాడుతూనే ఉంటా. మాధ్యమం మారుతుంది.. కాని మ‌న‌ బంధం మారదు` అంటూ ట్వీట్ చేశాడు కొర‌టాల‌. అయితే ఈయ‌న నిర్ణ‌యంపై అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొర‌టాల.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.