వైద్యాన్ని పలువురు వ్యాపారంగా మార్చుకుంటూ.. ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను చూశాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అలాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కూడా కొంతమందికి సాయం కూడా చేసాం.
అయితే బిల్లులు వసూలు చేయడంలో ఆసుపత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. సాధారణ సర్జరీకి కూడా ఆసుపత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటున్నాయి ? వీటిని ఎవరు నియంత్రించలేరా ?` అంటూ తన ట్వీట్లో నిఖిల్ ప్రశ్నించాడు. దీంతో ఈయన ట్వీట్ వైరల్గా మారింది.