ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీలో నిర్వహించబోయే ఇంటర్, పదోతరగతి పరీక్షలు నిర్వహించాల్సిన తేదీలపై చివరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. టెన్త్ పరీక్షలు జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు జరపాలని ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందుకోసం మొత్తం 4 వేల సెంటర్లలో పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా మొత్తం రాయాల్సిన 11 పేపర్లకు బదులు కేవలం 7 పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక సెప్టెంబర్ 2 లోగా పది తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించేలా ప్రణాళికలు సిద్దం చేశారని సమాచారం. అయితే జగన్ సమీక్షలో తీసుకొనే చివరి నిర్ణయం ఏమి తీసుకుంటారో అనే దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు.