టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, లేడీసూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ సినిమా 2017లోనే విడుదల కావాల్సి ఉంది.
కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్లోకి దిగలేకపోయింది. ఇక అప్పటి నుంచి విడుదల అప్పుడు, ఇప్పుడు అంటున్నారు.. కానీ, సినిమా మాత్రం రిలీజ్కు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై నిర్మాత తాండ్ర రమేష్ ఓ క్లారిటీ ఇచ్చారు. థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తాండ్ర రమేశ్ వెల్లడించారు. నేనే చిత్రాన్ని సొంతంగా విడుదల చేస్తున్నానని రమేశ్ తెలిపారు.
అలాగే గోపీచంద్-నయనతార కెమెస్ట్రీ, బి. గోపాల్ దర్శకత్వం, వక్కంతం వంశీ కథ, మణిశర్మ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషించారు.