రామ్-లింగుస్వామి మూవీపై న్యూ అప్డేట్‌..!?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది.

ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్న నేపథ్యంలో.. జులై మొద‌టి వారం నుంచి ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఇటీవ‌లే కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న రామ్.. షూటింగ్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. అంతేకాదు, ఈ సినిమా కోసం త‌న మేకోవ‌ర్ మార్చుకునే ప‌నిలో ఉన్నాడట రామ్‌. కాగా, ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.