నివేదా-రెజీనా కాంబోలో సినిమా…?

టాలీవుడ్ స్టార్ భామ‌లు అయిన రెజీనా క‌సాండ్రా, నివేదా థామ‌స్ క‌లిసి ఫీమేల్ సెంట్రిక్ మ‌ల్టీ స్టార‌ర్ తీస్తున్న సంగ‌తి విదిత‌మే. కాగా ఈ మూవీని సాకిని-ఢాకిని టైటిల్‌ను ఇప్ప‌టికే ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. కొరియ‌న్ హిట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ కు ఈ మూవీని రీమేక్‌గా తీస్తున్నారు నిర్మాత‌లు. అయ‌తే ఈ సినిమాకు సంబంధించిన ఎ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది.

అదేంటంటే సాకిని-ఢాకిని మూవీ షూటింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో స్టార్ట్ కానుంద‌ట‌. కొరియ‌న్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో రెజీనా, నివేథా క‌లిసి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకున్నారు ప్ర‌స్తుతం. సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేశ్ బాబు, సునీత తాటి సంయుక్తంగా డ‌బ్బులు పెడుతున్నారు. కాగా ద‌స‌రా కానుక‌గా ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. కొరియాలో వ‌చ్చిన మిడ్ నైట్ ర‌న్న‌ర్స్ సినిమా మంచి హిట్ టాక్ ను ద‌క్కించుకుంది. మ‌రి ఈ సినిమా రీమేక్‌లో నివేథా-రెజీనా ఎలా క‌నిపిస్తారో చూడాలి.