ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ప్రణీత సుభాష్.. బావ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హంగామా 2లో ప్రణీత నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యే ప్రణీత సైలెంట్గా ప్రియుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఎవరికీ చెప్పకుండా ఇంత హఠాత్తుగా ప్రణీత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటీ అన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయంపై తాజాగా ప్రణీత వివరణ ఇచ్చింది.
తాజాగా ప్రణీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకకు ప్లాన్ చేశామని..అయితే జూలై నెలలో ఆషాఢమాసం వస్తుండటంతో పాటు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అపనమ్మకంతో సడెన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే సమాజం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు అనవసర విలాసాల జోలికి వెళ్లొద్దనే భావనతో సింపుల్గా పెళ్లి చేసుకున్నామని ప్రణీత పేర్కొంది.