న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొత్తం పూర్తి చేయగా, తాజాగా మొదలు పెట్టిన షెడ్యూల్ లో ప్రస్తుత జనరేషన్కి సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారట.
ఈ ఫైనల్ షెడ్యూల్ను వీలనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నాని నటించిన టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో సినిమా అంటే .. సుందరానికి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.