వ‌ర్మ‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్ట్‌..ఏం జ‌రిగిందంటే?

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. వ‌ర్మ ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న చిత్రాల్లో దిశ ఎన్ కౌంటర్ ఒక‌టి. హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు వ‌ర్మ‌.

ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మించారు. ఆనంద్‌ చంద్ర దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచార‌ణ‌లో సినిమా టైటిల్ ఆశ ఎన్ కౌంటర్ గా మార్చినట్లు దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు.

అంతేకాదు, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏప్రిల్ 16న ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, అభ్యంతరం ఉంటే సెన్సార్ బోర్టు సర్టిఫికెట్​ను సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవచ్చునని ధర్మాసనం సూచించారు. ఇక ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశిస్తూ.. అప్పీలుపై విచారణ ముగించింది.