టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. వ్యాక్సిన్ల పేరుతో ఓ కేటుగాడు సురేష్ బాబు వద్ద నుంచి రూ.లక్ష నొక్కేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్బాబు ఆఫీస్కు ఫోన్ చేశాడు.
అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్.. అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం అతడికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
చివరకు ఇదంతా పెద్ద మోసం అని గ్రహించిన మేనేజర్ వెంటనే.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.