చిరంజీవి ఫ్యాన్స్ను వి.వి.వినాయక్ నిరాశపరచడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఠాగూర్. శ్రియ, జ్యోతిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.
2003లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వినాయక్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్..ఠాగూర్ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆశ, ఆసక్తి నాకూ ఉన్నాయి. కానీ అన్నివర్గాల ప్రేక్షకులను అంతగా ప్రభావితం చేసిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. సీక్వెల్ ఎప్పుడూ కూడా ముందుగా వచ్చిన సినిమాకి మించి ఉండాలి. లేదంటే ముందుగా తెచ్చిన పేరు చెడగొట్టినట్టు అవుతుంది. అందువల్లే ఠాగూర్ సీక్వెల్ ఆలోచన చేయను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే చిరు ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.