బాలీవుడ్ భామ యామీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రాల్లో నటించి తెలుగు వారికి బాగా దగ్గరైన యామీ గౌతమ్ తాజాగా పెళ్లి పీటలెక్కింది.
రచయిత, దర్శకుడు ఆదిత్య ధార్తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది యామీ. కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో శుక్రవారం వీరి కళ్యాణం వైభవంగా జరిగింది.
ఈ విషయాన్ని యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం యామీ గౌతమ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.