వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!

జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం […]

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]

బాబు టూర్.. కన్నీళ్లు తుడవడానికా.. పెట్టుకోవడానికా..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితుల కష్టాలను చూడడానికి స్వయంగా బయలుదేరి వెళ్లారు. కడప జిల్లాలో ఒక రోజంతా పర్యటించారు. చిత్తూరు జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలలో వరద తాకిడికి దెబ్బతిని నానా కష్టాలు పడిన ప్రజలను ఆయన పరామర్శిస్తారు. షెడ్యూలు ప్రకారం వరద బాధితుల కన్నీళ్లు తుడవడానికి చంద్రబాబునాయుడు వెళ్లినట్లే కనిపిస్తూ ఉంది కానీ, వాస్తవంలో ఊరూరూ తిరిగి తాను కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆయన వెళుతున్నట్లుగా ఉంది! వరద బాధిత ప్రాంతాల్లో […]

జగన్: నిన్న బుకాయించి.. నేడు దొరికిపోయారు..!

జగన్ మడమ తిప్పని నాయకుడు అని ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆయన అంతే దృఢంగా మొండిగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం మారుతోంది. జగన్ తరహా కూడా మారుతోంది. తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తించే తీరు కూడా మారుతోంది. మడమ తిప్పుతున్నారు.. అందులో ఏమీ సదేహం లేదు. అయితే నిన్న ఈ విషయంలో బుకాయించేలా పార్టీ వాళ్లు ఏదో కొంత సమర్థించుకున్నారు గానీ.. నేడు అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ రాష్ట్రమతా […]

కొత్త బిల్లు కోసం ఢిల్లీ స్పెషలిస్టులకు పిలుపు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అనే లక్ష్యంతో మూడు రాజధానులు పెట్టి తీరుతానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలను శాసనసభ సాక్షిగా ప్రకటించేశారు. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏ బిల్లు మీద అయితే హైకోర్టులో విచారణ జరుతున్నదో ఆ బిల్లును రద్దు చేశారు. దానితో పాటు సీఆర్డీయేను పునరుద్ధరించారు. న్యాయపరమైన లొసుగులు లేకుండా కొత్త బిల్లు రూపొందించి సభ ముందుకు తెస్తా అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు లోపభూయిష్టమైన రాజధాని వికేంద్రీకరణ బిల్లును కొత్తగా […]

జగన్ వెనుకడుగు వెనుక- బ్రెయిన్ ఎవరిది..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అని అందరూ ఎడాపెడా రాసేశారు. అలాంటి మాటలను దృష్టిలో ఉంచుకునే ఏమో.. కొన్ని గంట లతర్వాత సభలోకి వచ్చినప్పుడు ‘తగ్గేదే లే’ అని జగన్ తెగేసి చెప్పారు. మూడు రాజధానుల విషయంలో చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా వెల్లడించారు. అయితే ఎందుకు వెనుకంజ వేసినట్టు? సింహం కూడా వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తుంది.. ఆ తర్వాత.. ఉన్నపళంగా ముందుకు దూకి పంజా విసురుతుంది.. అని జగన్మోహన్ రెడ్డి […]

ఎగసిపడిన సంతోషం.. అంతలోనే దుఃఖం..!

అమరావతి రాష్ట్రం కోసం పోరాడుతున్న రైతులు సోమవారం నాడు రెండు రకాల భావోద్వేగాలకు గురయ్యారు. ఒక ప్రకటన రాగానే.. తాము అపురూపమైన విజయం సాధించేశాం అని మురిసిపోయారు. పండగ చేసేసుకున్నారు. స్వీట్లు తినిపించేసుకున్నారు. ఒక్క అమరావతి రైతులు మాత్రమే కాదు.. వారి వెనుక నుంచి నడిపిస్తున్నారనే ముద్రను ఎదుర్కొంటున్న తెలుగుదేశం వారు కూడా రాష్ట్రంలో పలు చోట్ల స్వీట్లు తినిపించుకున్నారు. అయితే అంతలోనే.. అతి తక్కువ సేపటికే సీన్ మారిపోయింది. మోదం స్థానే ఖేదం వచ్చింది. సంతోషం […]

ఓడిపోయినా.. మోడీని హీరో చేస్తున్నారే..!

కేంద్ర ప్రభుత్వం మూడువ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేసి తీరాల్సిందేనని రైతులు యుద్ధం ప్రకటించారు. మీకు తెలియడం లేదు.. మేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చాలా మంచి చట్టాలు తెచ్చాం.. వాటివల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకునేంత తెలివితేటలు మీకు లేవు.. మేం చెప్పినమాట విని చట్టాలను ఫాలోకండి.. అని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. రైతులు తమ యుద్ధాన్ని అంతకంటె తీవ్రం చేశారు. మా బాగు ఏమిటో మాకు తెలుసు.. మరీ […]