ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. అయితే ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్.. సొంతంగా పోటీచేస్తానని ప్రకటించాడు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఈ సారి ఎలాగైనా `సీఎం` పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సొంతంగా పోటీచేసేకంటే ఎవరో ఒకరిని కలుపుకుని వెళితే సీఎం అయిపోవచ్చని భావిస్తున్నారు. అందుకే అటు జనసేన, ఇటు వామపక్షాలతో పొత్తు కోసం […]
Category: Politics
చంద్రబాబుకు అక్కడ చుక్కలే
ప్రస్తుత రాజకీయాల్లో అపార రాజకీయ అనుభవమున్న నేత ఎవరంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్రబాబు! రాజకీయ వ్యూహాలు రచించి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అయనకు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయనకే ఒక జిల్లాలో రాజకీయాలు చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా పరిస్థితులు దిగజారిపోతున్నాయట. ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గ రాజకీయాలే ఇందుకు కారణమని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదంటే […]
వెంకయ్యా ఈ కుప్పి గంతులేందయ్యా..
`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామపక్షాలపై విమర్శలు గుప్పించాలన్నా ఆయన తర్వాతే!! `ఆకాశంలో స్కామ్, నీటిలో స్కామ్, గాలిలో స్కామ్ ఇలా వారి హయాంలో అన్నింటిలోనూ స్కామ్లే` అని కాంగ్రెస్ను ఏకిపారేయాలన్నా ఆయన తర్వాతే!! ప్రాసలు, పంచ్లు.. మాటల తూటాలతో దాడి చేస్తారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో పోరాడిన ఆయనే ప్యాకేజీతో ఏపీకి లాభమని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని ప్లేట్ ఫిరాయించారు! విశాఖకు రైల్వే జోన్ వచ్చేలా కృషిచేస్తానని […]
మోడీ పొగిడారు, అమిత్ షా విమర్శించారు.
రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కెసియార్ని విమర్శించారు. కెసియార్ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]
ఎడ్యుకేట్ చేస్తున్న వెంకయ్య.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]
మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]
పవన్కి వెన్నుదన్నుగా నాగబాబు.
జనసేన పార్టీకి ప్రధాన బలం అభిమానులే. పవన్కళ్యాణ్కి మొదట్లో మెగా అభిమానుల మద్దతు మెండుగా ఉండేది. అందులోంచి కొత్తగా ‘పవనిజం’ పుట్టింది. తద్వారా పవన్కళ్యాణ్కి మెగా అభిమానులతోపాటు ప్రత్యేకంగా ఇంకో అభిమానగణం తయారైందని చెప్పడం నిస్సందేహం. అయితే మెగా అభిమానుల్నీ, పవన్ అభిమానుల్నీ ఒక్కచోట చేర్చే బాధ్యతను ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు తీసుకున్నారని సమాచారమ్. మెగా, పవన్ అభిమానుల మధ్య విభేదాలున్నాయని కాదుగానీ, కొన్ని అంశాల్లో ఈ పవన్ అభిమానులు, మెగా అభిమానులతో విభేదిస్తుంటారు. అవి కూడా […]
హోదా – తల్లిపాలు, ప్యాకేజీ – డబ్బా పాలు.
డబ్బా పాలు చంటి పిల్ల ఆరోగ్యానికి క్షేమం కాదు. కానీ విధిలేని పరిస్థితుల్లో వైద్యులు డబ్బా పాలను పసి పిల్లలకు ఆహారంగా సూచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అనే పసిపాపకి ఇప్పుడు డబ్బా పాల అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే తల్లిని కేంద్రమే దూరం చేసింది. దారుణం కదా ఇది. ఈ పోలిక తెచ్చింది బిజెపి మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్. చిత్తూరు జిల్లాకు చెందిన శివప్రసాద్, రాజకీయ నిరసనల కోసం సరికొత్త […]
ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పాను – తప్పేంటి!
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]