ఒకే సారి ఇద్దరితో బన్నీ!!

వరసు హిట్లతో ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలపై దృష్టిపెట్టాడు. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. బన్నీ కోసం టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఇప్పటికే పలువురు కథలు వినిపించారు. కానీ బన్నీ హరీష్ శంకర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఐతే పనిలో పనిగా మరో మాస్ డైరెక్టర్ ని బన్నీ లైన్లో పెట్టినట్లు సమాచారం. తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి ఇప్పటికే బన్నీకి ఓ స్టోరీ వినిపించాడు. అదే టైమ్ లో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కూడా బన్నీకి స్క్రిప్ట్ వినిపించాడు. ఐతే లింగుస్వామి చెప్పిన సబ్జెక్ట్ కే బన్నీ ఓటెేసినట్లు సమాచారం. విక్రమ్ మళ్లీ నితిన్ వైపు మొగ్గు చూపడంతో లింగుస్వామి సినిమానే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వీలైనంత త్వరగా హరీశ్ శంకర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నిర్మాత దిల్ రాజు ట్రై చేస్తున్నారు. అటు లింగుస్వామి మూవీ కూడా ఒకేసారి స్టార్ట్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. లింగస్వామి సినిమా అంటే పక్కా మాస్ అంశాలతో ఉంటుంది. సరైనోడుతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన బన్నీ లింగుస్వామి మూవీతో మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. పైగా తమిళ్ లోనూ మార్కెట్ పెంచుకునే అవకాశముంటుంది.

మరి బన్నీ రెండు పడవల ప్రయాణం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.