లేటు వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. అవి కూడా సీనియర్ హీరోస్తో పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అవకాశం వచ్చినందుకు శ్రియ చాలా గర్వంగా ఫీలవుతోంది. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి శ్రియ ‘చెన్న కేశవరెడ్డి’ సినిమాలో నటించింది.
ఇప్పుడు రెండో సారి బాలయ్యతో జతకడుతోంది. ఆ సినిమాలో బబ్లీ గాళ్గా నటిస్తే, ఈ సినిమాలో పెద్ద తరహాలో హుందాతనంగా నటించనుంది. ఇప్పటికే హుందాతనానికి శ్రియ ది బెస్ట్ అని నిరూపించాయి రీసెంట్గా ఆమె తెలుగులో చేసిన ‘గోపాల గోపాల’, తమిళంలో ‘దృశ్యం’ సినిమాలు. అందుకే ఈ సినిమాలో గౌతమీ పుత్ర శాతకర్ణి భార్య పాత్రలో శ్రియ అయితేనే బాగుంటుందని క్రిష్ భావించాడట. ఈ పాత్ర కోసం నయనతార, త్రిష ఇలా చాలా మంది హీరోయిన్స్ని పరిశీలించి చివరికి శ్రియకి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. చారిత్రాత్మక నేపధ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని బాలయ్యకు తల్లి పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్నందిస్తున్నారు.