‘బ్రహ్మూెత్సవం’ తర్వాత మహేష్ కొంచెం సైలెంటయ్యాడు. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా సెట్స్పైకి వెళ్ళనుండగా, దానికి సంబందించి ఏ చిన్న న్యూస్ కూడా ఇంకా రివీల్ కావడంలేదు. ‘బ్రహ్మూెత్సవం’ ఎఫెక్ట్తో మహేష్, ఆచి తూచి వ్యవహరిస్తుండడమే దీనికి కారణమట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమాకి ఓవర్గా హైప్ క్రియేట్ చేశారు. ఆ సినిమా అంత ఓవర్గానే ఫెయిల్ అయ్యింది. మహేష్ కెరీర్లో నే ఈ సినిమా డిజాస్టర్ అని ప్రూవ్ అయ్యింది. అందుకే తన నెక్స్ట్ సినిమా విషయంలో కొంత గోప్యంగా వ్యవహరించమని చిత్ర యూనిట్ని ఆదేశించాడట మహేష్. అందుకే ఈ సినిమాకి సంబంధించి అప్పుడే ఏ విధమైన పబ్లిసిటీ క్రియేట్ కాకుండా చూసుకుంటున్నాడట మహేష్. సినిమాకి సంబంధించన ప్రతీ విషయాన్ని పక్కా ప్లానింగ్తో తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నాడని సమాచారమ్.
కథ ఏంటి? మహేష్ గెటప్ ఎలా ఉండనుంది వంటివన్నీ సస్పెన్స్గానే ఉన్నాయి. అయితే డిఫరెంట్ గెటప్లో మహేష్ని మురుగదాస్ చూపిస్తాడని అయితే సమాచారం. దీనికోసం పలు గెటప్స్ని కూడా ట్రై చేస్తున్నారట. కానీ అవేవీ బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. మహేష్ లుక్ని టైటిల్తో సహా లేదంటే టైటిల్ లేకుండా ‘ఫస్ట్ లుక్’గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అతి త్వరలోనే ఈ సినిమా విశేషాల్ని చిత్ర బృందం మీడియాకి తెలియజేయనుంది. మొత్తానికి ‘బ్రహ్మూెత్సవం’ ఇచ్చిన షాక్తో మహేష్, వెంటనే తేరుకుని, చాలా జాగ్రత్త పడుతున్నాడన్న మాట.