కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు వాడైనా తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నాడు. ప్రస్తుతం నడిగర్ సంఘంలో విశాల్ కీ రోల్ పోషించడంతో పాటు అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోను ముందుంటుంన్నాడు. ప్రస్తుతం విశాల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్గా మారిపోయాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ ఫ్యామిలీ వ్యాపారాలు చేస్తూ చెన్నైలోనే స్థిరపడింది.
ప్రస్తుతం నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ గా మరియు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ మన పవర్స్టార్ పవన్కళ్యాణ్తో పోటీపడుతున్నాడు. అదేంటి విశాల్ మన పవర్స్టార్ మీద పోటీపడడం ఏంటి ? ఇదేమైనా రాజకీయ పోటీనా ? లేదా ఏదైనా సినిమా రంగానికి సంబంధించిన పదవికి పోటీనా అనుకోవద్దు…వీరిద్దరి మధ్య జరిగేది బాక్సాఫీస్ పోటీనే.
విశాల్, సమంత జంటగా కొత్త దర్శకుడు కేఎస్. మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఇరుంబుదురై (ఇనుపతెర) 2018 సంక్రాంతి బరిలోకి దిగుతోంది. విశాల్ లేటెస్ట్ మూవీ డిటెక్టివ్ తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఇక ఈ ఇరుంబుదురై సినిమాను సైతం తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధానపాత్రలో నటించబోతోన్న ఈ సినిమాలో సమంత ఉండడంతో తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సంక్రాంతికి తెలుగులో పవన్కళ్యాణ్ – త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా కూడా వస్తోంది. తెలుగులో పవన్ సినిమాకు విశాల్ సినిమా పోటీకాకపోయినా విశాల్ కాన్ఫిడెన్స్తో తన సినిమాను ఇక్కడ కూడా సంక్రాంతికే తేవడం మాత్రం విశేషమే.