యువరత్న నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన 101వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
రిలీజ్ అయ్యాయి. బాలయ్య – పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఏదో కొత్తగా ఉంటుందని అందరూ అంచనాలతో ఉన్నారు. వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు టైటిల్తో బాలయ్య – పూరి దిమ్మతిరిగి పోయే షాక్ ఇచ్చారు. ఎవ్వరి అంచనాలకు అందని టైటిల్తో వచ్చారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘తేడా సింగ్’, ‘ఉస్తాద్’ ‘జై బాలయ్య ’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నా.. వాటిని తోసిరాజని ‘పైసా వసూల్’ అంటూ డిఫరెంట్ టైటిల్ను సినిమాకు ఖరారు చేశారు. ఇక, ఫస్ట్ లుక్లో బాలయ్యను పూరీ తన మార్కు హీరోయిజంతో చూపించారు.
ఇక పైసా వసూల్ టైటిల్ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీనే వినపడుతోంది. పూరి గత కొద్ది రోజులుగా రొటీన్ స్టోరీలోనే సినిమాలు లాగించేస్తున్నాడు. ఇప్పుడు బాలయ్యతోనూ సహజంగానే యాక్షన్ కథతో సినిమా చుట్టేస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు టైటిల్ను బట్టి చూస్తే పూరి బాలయ్యతో ఏదో భిన్నమైన సినిమానే చేయనున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.
బాలయ్యకు బాగా కలిసొచ్చిన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు. మరి టైటిల్కు తగ్గట్టుగా బాలయ్య – పూరి సినిమా ఏ రేంజ్లో పైసా వసూల్ చేస్తుందో చూడాలి.