మాస్ మహరాజ్ రవితేజ యంగ్టైగర్ ఎన్టీఆర్కే పోటీగా వస్తున్నాడు. క్రేజ్లోను, మార్కెట్లోను ఎన్టీఆర్తో పొల్చుకుంటే దరిదాపుల్లోకి కూడా రాని రవితేజ రాడు. అలాంటి రవితేజ ఎన్టీఆర్తో పోటీ పడడం ఏంటని షాక్ అవ్వొద్దు. వీరిద్దరి సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కావడం లేదు. బెంగాల్ టైగర్ తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘రాజా ది గ్రేట్’ విక్రమ్ సిరి దర్శకత్వంలోని ‘టచ్ చేసి చూడు’. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో వున్నాయి. ‘టచ్ చేసి చూడు’లో రవితేజ మాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన రాశీఖన్నా, శీరత్కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 12న సినిమా రిలీజ్ డేట్గా ఎనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే మూడు వరుస హిట్లతో కెరీర్లోనే తిరుగులేని ఫామ్లో ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరెక్షన్లో జైలవకుశ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల టీజర్లు రంజాన్ రోజునే రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆ రోజు ఎన్టీఆర్ అభిమానులు, రవితేజ అభిమానులు సందడి చేసుకోనున్నారు. మరి ఎన్టీఆర్కు పోటీగా తన సినిమా టీజర్ను రిలీజ్ చేస్తోన్న రవితేజ ఎంత వరకు ఆకట్టుకుంటాడో ? చూడాలి.