మ‌హేష్ హ్యాపీకి ప‌వ‌న్ బ్రేకులు

టాలీవుడ్‌లో టాప్ హీరో అయిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఆనందానికి మ‌రో టాప్ హీరో, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ్రేకులు వేసేశాడు. అస‌లు విష‌యంలోకి వెళితే మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా లేట్‌గా ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమాను తెలుగు, త‌మిళ్‌, హిందీలో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సోలోగా వ‌చ్చి మూడు భాష‌ల బాక్సాఫీస్‌ను దున్నేయొచ్చ‌ని మ‌హేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే ఇంత‌లోనే షాక్‌… ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తోన్న సినిమాను స్పైడ‌ర్ సినిమాకు వారం రోజుల ముందుగా థియేట‌ర్ల‌లోకి తెచ్చేస్తున్నార‌ట‌. మ‌రి స్పైడ‌ర్‌కు వారం రోజుల ముందు ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా వ‌స్తే ఆ ఎఫెక్ట్ స్పైడ‌ర్‌పై చాలా గ‌ట్టిగానే ప‌డుతుంది.

ఇక బాల‌య్య – పూరి కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సినిమా (వ‌ర్కిగ్ టైటిల్ తేడాసింగ్‌) సైతం ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29నే వ‌స్తోంది. అప్పుడు ఆ సినిమాకు కూడా కొన్ని థియేట‌ర్లు ఇవ్వాలి. అప్ప‌టికే చాలా థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ సినిమా ఉంటుంది. అప్పుడు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన స్పైడ‌ర్‌కు కావాల్సిన‌న్ని థియేట‌ర్లు ఉండ‌వు. ఇది ఖ‌చ్చితంగా వ‌సూళ్ల‌పై ఎఫెక్ట్ ఉంటుంది.

ఏదేమైనా టాలీవుడ్‌లో ద‌స‌రా సీజ‌న్‌లో ఈ ముగ్గురు అగ్ర‌హీరోల సినిమాల మ‌ధ్య జరిగే పోటీ బాక్సాఫీస్ పోరు హీటెక్కిస్తోంది. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రి సినిమా ద‌స‌రాకు బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుందో చూడాలి.