మ‌హిష్మ‌తి రాజ్యంలా రాజ‌మౌళి ఫామ్ హౌస్ 

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 స‌క్సెస్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు రాజ‌మౌళి న్యూస్ కేవ‌లం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి నేష‌న‌ల్ ఫిగ‌ర్. ఇంకా చెప్పాలంటే అంత‌ర్జాతీయ స్థాయిలో కూడా రాజ‌మౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సాహోరే రాజ‌మౌళి…జ‌య‌హార‌తి నీకే ప‌ట్టాలి అన్న‌ట్టుగా ఆయ‌న్ను అంద‌రూ కీర్తిస్తున్నారు.

ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో విదేశీటూర్ల‌లో ఉన్న రాజ‌మౌళి తాను విశ్రాంతి తీసుకునేందుకు ఓ చ‌క్క‌టి ఫామ్‌హౌస్‌ను నిర్మించుకుంటున్నాడ‌ట‌. హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామంలో రాజ‌మౌళి ఈ ఫామ్‌హౌస్ నిర్మాణానికి 100 ఎక‌రాలు కొన్నాడ‌ని టాక్‌. ఇక్క‌డ మ‌హిష్మ‌తి రాజ్యంలా ఫామ్‌హౌస్‌తో పాటు అన్ని ర‌కాల మొక్క‌లు, కొంత భాగంలో వ్య‌వ‌సాయం చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌గా తెలుస్తోంది.

బాహుబ‌లి లాంటి సినిమా సెట్టింగుల కోస‌మే ఓ కార్మికుడిలా సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డిన రాజ‌మౌళి ఇప్పుడు తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌ను ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటాడో ? చూడాలి.