సిద్దప్పా ఏందీ నీ కాకి గోలా??

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కర్ణాటక సీఎం..మరో అంకానికి తెర తీశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వాచీ గొడవ సద్దుమణగ్గానే… ఇప్పుడు కారు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు మొదట్నుంచి నమ్మకాలెక్కువ. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన అధికారికంగా వాడే కారుపైన ఒక కాకి కూర్చుంది. ఎంత తరిమినా పోకుండా కారు బానెట్ పై తచ్చాడింది. ఆ మొత్తాన్ని ఎవరో వీడియో కూడా తీరు. కాకి తన కారునే అంటిపెట్టుకుందని తెలిసిన సిద్దరామయ్య వెంటనే కారు మార్చేశారు. రూ.35 లక్షలు పెట్టి కొత్త టొయోటా ఫార్చ్యునర్ కారు కొన్నారు.

దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కాకి కూర్చుందని అంత డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనాన్ని అలా దుర్వనియోగపరచడం సబబు కాదంటూ విమర్శిస్తున్నారు. ఇంతకుముందు కూడా సిద్ధ రామయ్య రూ.70 లక్షల వాచీని చేతికి పెట్టుకుని హడావుడి చేశారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయడంతో వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి ఇచ్చేశారు.