టాప్ లేపుతోన్న బిగ్ బాస్‌…. ముగ్గురు హాట్ సుంద‌రాంగుల ఎంట్రీ

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో సూపర్ హిట్ అయింది. ఈ షో సూపర్ హిట్ అయిందన్నదానికి టీఆర్పీ రేటింగులే నిదర్శనం. తెలుగులో ఏ షోకు కూడా రాని రీతిలో టీఆర్పీ రేటింగులు బిగ్ బాస్ షోకు వచ్చాయి. 16.8 రేటింగ్‌తో బిగ్ బాస్ తెలుగు బుల్లితెర‌ను షేక్ చేస్తోంది.

రికార్డు రేంజ్‌లో టీఆర్పీలు రావ‌డంతో స్టార్ మా యాజ‌మాన్యం బిగ్ బాస్ హౌస్‌లోనే సంబ‌రాలు చేసింది. ఎన్టీఆర్ స్వ‌యంగా కేక్ క‌ట్ చేసి సంబ‌రాల్లో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఈ షో నుంచి ఇప్ప‌టికే బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు, జ్యోతి అవుట్ అయ్యారు. మ‌మైత్ ఖాన్ బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ వ‌చ్చింది. నిన్న మ‌ధుప్రియ‌ను ఎలిమినేట్ చేసేశారు.

ఇక ఈ షోకు మ‌రింత క్రేజ్ తెచ్చేందుకు ఇప్పుడు మా యాజ‌మాన్యం ఏకంగా ముగ్గురు హాట్ సుంద‌రాంగిణుల‌ను వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లో ఎంట్రీ చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. హాట్ యాంక‌ర్ అన‌సూయ‌, తేజ‌స్విని మాదివాడ‌, ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాలాలు హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురూ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తే ర‌చ్చ మామూలుగా ఉండ‌దుగా…అంతా హాట్ ర‌చ్చే జ‌రుగుతుంది.