టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కాంబో అంటే ఇండస్ట్రీలో సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
గతంలో వీరి కాంబినేషన్లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు సూపర్డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులను రూ.21 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుంది. ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్లో శాటిలైట్ రేటు పలకడం ఓ రికార్డు.
ఇక హిందీ శాటిలైట్ రైట్స్ కూడా రూ.11 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆరకంగా చూస్తే తెలుగు, హిందీ వెర్షన్ శాటిలైట్స్ రైట్స్ ద్వారా రూ.32 కోట్లు వచ్చేశాయి. ఇప్పటి వరకు బాహుబలి 1, 2 శాటిలైట్ రైట్స్ను రూ. 20 కోట్లకు మా టీవీ దక్కించుకోగా, మహేష్ స్పైడర్ మూవీ రైట్స్ రూ. 26 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమాతో పవర్స్టార్ పవర్ ఏంటో మరోసారి స్పష్టమైంది. హారిక హాసిన్ క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.మణికందన్ సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.